అనంతపురం జిల్లా కలెక్టర్ ఎస్ గౌతమి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్ ఈ నెల 26న నార్పలకు రానున్నట్లు కలెక్టర్ గౌతమి తెలిపారు. వాస్తవానికి సీఎం జగన్ ఈనెల 17 నార్పలకు రావాల్సి ఉంది. అనివార్య కారణాలతో ఆయన పర్యటన వాయిదా పడింది. జగనన్న వసతి దీవెన కార్యక్రమంలో పాల్గొనేందుకు జగన్ రానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. తిరిగి ఇదే నెల 26న సీఎం జగన్ పర్యటన ఖరారైనట్లు కలెక్టర్ గౌతమి వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa