ఐపీఎల్లో భాగంగా నేడు ముంబై, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. సన్రైజర్స్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఉప్పల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 192 భారీ స్కోరు చేసింది. అయితే 193 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన సన్రైజర్స్ నిర్ణీత 19.5 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది.మయాంక్ అగర్వాల్ 48 పరుగులు,హెన్రిచ్ క్లాసెన్ 36 పరుగులు చేసారు. ముంబై బౌలర్లలో పియూశ్ చావ్లా, రైలీ మెరిడిత్, బెహ్రాండార్ఫ్ తలా రెండు వికెట్లు తీశారు. సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్ లో తొలి వికెట్ ను సాధించాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa