దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలతో వాతావరణం హీటెక్కుతోంది. ఎండలే కాకుండా వడగాల్పులు కూడా వీస్తున్నాయి. దీంతో ప్రజలెవ్వరూ మధ్యాహ్నం సమయంలో బయటకు రావడం లేదు. ఎండ ప్రతాపం కారణంగా ఇంట్లోని చిన్నపిల్లలను కూడా ఆడుకోవడానికి బయటకు పంపించడం లేదు. ఈ క్రమంలో ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఎండల కారణంగా ఒడిశాలోని స్కూళ్లకు ఆ రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించింది. ప్రభుత్వ స్కూళ్లతో పాటు ప్రైవేట్ స్కూళ్లను కూడా రెండు రోజుల పాటు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. బుధవారం నుంచి రెండు రోజుల పాటు క్లోజ్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. అంగన్వాడీ స్కూళ్లను కూడా ఈ రెండు రోజుల పాటు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. అన్ని ప్రభుత్వ ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలను బుధవారం, గురువారం మూసివేయాలని తెలిపింది.
స్కూళ్ల మూసివేతకు సంబంధించి ఒడిశా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. దేశవ్యాప్తంగా 40 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఒడిశాలో కూడా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో స్కూళ్లకు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. అయితే ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే క్లాసులు నిర్వహించాలని ఈ నెల 11న ఒడిశా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. స్కూల్స్ ఓపెన్ చేసిన రెండు రోజులకే స్కూల్స్ మూసివేయాలని తెలిపింది. ఇప్పుడు మరోసారి స్కూల్స్ను క్లోజ్ చేయాలని సూచించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa