పెద్దకడబూరు మండలంలోని రైతుల సమస్యలను పరిష్కరించడంలో ఇంచార్జీ తహసీల్దార్ పూర్తిగా విఫలమయ్యారని సీపీఐ తాలూకా కార్యదర్శి భాస్కర్ యాదవ్, మండల కార్యదర్శి వీరేష్, సీపీఐ కమిటీ సభ్యులు రాజు, ఏఐకేఎస్ తాలూకా కార్యదర్శి మబ్బు ఆంజనేయ విమర్శించారు. గురువారం పెద్దకడబూరులోని మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఏఐకేఎస్ ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంచార్జీ తహసీల్దార్ విధి నిర్వహణలో రాజకీయ నాయకులకు ఓ రకంగా, సామాన్యులకు మరో రకంగా చేస్తున్నారని విమర్శించారు. రైతుల సమస్యలు పరిష్కరించని తహసీల్దార్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa