ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ నెల 26న అనంతపురం జిల్లాలో పర్యటించనున్న సీఎం జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 24, 2023, 05:29 PM

ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఎల్లుండి (26.04.2023)  అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం నార్పలలో ప‌ర్య‌టించ‌నున్నారు. జగనన్న వసతి దీవెన కార్యక్రమం – లబ్ధిదారుల ఖాతాల్లో వైయ‌స్ జ‌గ‌న్‌ నగదు జమ చేయనున్నారు. ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.20 గంటలకు నార్పల ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలకు చేరుకుంటారు. 10.40 – 12.35 గంటల వరకు నార్పల క్రాస్‌రోడ్స్‌ వద్ద ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొని ముఖ్యమంత్రి ప్రసంగం, అనంతరం జగనన్న వసతి దీవెన కార్యక్రమం – లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్న సీఎం, కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 1.10 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 2.50 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa