ఏపీ పోలీసుల పట్ల కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యవహరించిన తీరు సరికాదని డిప్యూటీ సీఎం రాజన్నదొర తెలిపారు. ఇటీవల ధర్మేంద్ర ప్రధాన్ కొఠియా పర్యటనకు వచ్చినప్పుడు ఏపీ గో బ్యాక్ అంటూ ఏపీ పోలీసులకు ఉద్దేశించి పేర్కొన్న విషయం విదితమే. అయితే ఆయన పర్యటించిన గ్రామాల్లోనే రాజన్నదొర సోమవారం పర్యటించి, కేంద్రమంత్రి తీరును ఖండించారు. ఏపీ ఒడిశా భాయి భాయి అని స్నేహహస్తం చాచారు. విజయనగరం జిల్లా, సాలూరు మండలం కొఠియా గ్రూప్ గ్రామాలైన పట్టుచెన్నారు, పగులుచెన్నారు, సొలిపిగుడ, కోనాధార, ఎగువ మెండంగిల్లో ఆయన పర్యటించారు. ఆయా గ్రామాల్లో ఎంపీడీవో గొల్లపల్లి పార్వతి ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. కొఠియా గ్రూప్ గ్రామాల్లో డిప్యూటీ సీఎం రాజన్నదొర పర్యటనకు భారీసంఖ్యలో భద్రత బలగాలను మోహరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa