సర్వేలన్నీ వైయస్ఆర్సీపీకే అనుకూలంగా ఉన్నాయని, మళ్లీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని చెబుతున్నాయని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి తెలిపారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు. రజనీకాంత్ చంద్రబాబు చేతిలో రోబోలా మారారని విమర్శించారు. చంద్రబాబు ఎన్ని వేషాలు వేసినా ప్రజలు నమ్మరని చెప్పారు. చంద్రబాబు ఫెయిల్యూర్ లీడర్ అని ప్రజలకు తెలుసు అన్నారు. సీఎంవైయస్ జగన్ ప్రజాదరణ చూసి చంద్రబాబు భరించడం లేదన్నారు. వైయస్ జగన్ ఇమేజ్ ఎవరెస్ట్ శిఖరమంతా గొప్పగా పైకి ఎదుగుతూ ఉందని, చంద్రబాబు ఇమేజీ రోజు రోజుకు అధఃపాతాలానికి వెళ్తుందన్నారు. లోకేష్ ప్రస్టేషన్ మరింతగా ఉందని మండిపడ్డారు. ప్రస్టేషన్లో మరింతగా దిగజారి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. లోకేష్ పాదయాత్ర జోకేష్ యాత్రగా మారిందని అభివర్ణించారు. టీడీపీకి అది ఒక పాడే యాత్ర అని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఎద్దేవా చేశారు. మంగళవారం వరుదు కళ్యాణి విశాఖలో మీడియాతో మాట్లాడారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa