రాబోయే లోక్సభ ఎన్నికల కోసం.. ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాలని.. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోరారు. భారతదేశం మార్పు కోరుకుంటోందని వ్యాఖ్యానించారు. ప్రజల కంటే గొప్ప శక్తి లేదన్న మమతా.. జుమ్లా రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మా-మతి-మనుష్ సందర్భంగా.. మమత బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలు ఏకం కాకపోతే.. భారతదేశాన్ని విభజించేవారే గెలుస్తారని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు.
గత పదేళ్లలో బీజేపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని మమతా బెనర్జీ విమర్శించారు. చరిత్రను మార్చడం, జుమ్లా రాజకీయాలు చేయడం, ఎన్ఆర్సీ పేరుతో ప్రజలకు అన్యాయం చేయడమే బీజేపీకి తెలుసని ఫైర్ అయ్యారు. ప్రధాని మోదీ పేరు ఎత్తకుండానే.. ఆయనను టార్గెట్ చేశారు. ‘మన్ కీ బాత్’ పేరుతో అబద్ధాలు చెబుతూ.. ప్రజలను మోసం చేస్తుందన్నారని ఆరోపించారు. అందుకే ప్రతిపక్షాలు అన్నీ ఏకమై.. ప్రజలకు వివరించాలని అభిప్రాయపడ్డారు.
ఇటీవలే బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, టీఎంసీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భేటీ అయ్యారు. 2024 ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. అప్పుడు కూడా బెనర్జీ మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు కలిసి కూర్చుని తదుపరి కార్యాచరణపై చర్చిస్తామన్నారు. లక్ష్యం స్పష్టంగా ఉంటే ఎవరూ ఆపలేరని వ్యాఖ్యానించారు. అన్ని ప్రతిపక్ష పార్టీలతో టచ్లో ఉన్నామని.. నితీష్ కుమార్ వెల్లడించారు. మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా విపక్షాల ఐక్యత కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa