ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైఎస్ వివేకా ఇంటి వాచ్‌మెన్‌కు అస్వస్థత,,,తిరుపతి ఆస్పత్రిలో చికిత్స

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 03, 2023, 08:09 PM

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి రంగన్నకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన్ను వెంటనే చికిత్స కోసం కడప జిల్లా పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించగా.. అక్కడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయన ఆస్తమాతో బాధపడుతున్నట్లు చెబుతున్నారు.


రంగన్న వివేకా హత్య కేసులో రెండేళ్ల క్రితం మేజిస్ట్రేట్‌ ముందు కీలక వాంగ్మూలం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆయన ప్రత్యక్ష సాక్షి కావడంతో 1+1 భద్రత ఏర్పాటు చేశారు. ఆ సెక్యూరిటీ సిబ్బందే రంగన్నను ఆసుపత్రికి తరలించారు. రంగన్న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి ఇంటికి కాపలాదారుగా ఉన్నారు. ఆయన ప్రత్యక్ష సాక్షిగా ఈ కేసులో కీలకంగా ఉన్నారు.


మరోవైపు సీబీఐ వివేకా హత్య కేసులో దూకుడు పెంచింది. మంగళవారం వివేకాకు ఏపీగా పనిచేసిన కృష్ణారెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని సీబీఐ ఆఫీసులో దాదాపు ఐదు గంటలపాటు ప్రశ్నించారు. ప్రధానంగా వివేకా హత్య జరిగిన స్థలంలో లేఖ అంశంపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. సీబీఐ అధికారులు నాలుగు రోజుల క్రితమే పులివెందులలో కృష్ణారెడ్డి ఇంటికి వెళ్లారు. ఆయన లేకపోవడంతో కుటుంబసభ్యులను ప్రశ్నించారు. కేసు విచారణ కీలక దశకు చేరుకుంటున్న సమయంలో కృష్ణారెడ్డిని ప్రశ్నించడం ఆసక్తికరంగా మారింది.


సీబీఐ గత వారం వైఎస్ సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డిల స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసిన సంగతి తెలిసిందే. వైఎస్ వివేకా కంప్యూటర్ ఆపరేటర్ ఇనయ్ తుల్లా, ఉదయ్ కుమార్ తండ్రి ప్రకాష్ రెడ్డి‌లను కూడా సీబీఐ అధికారులు ప్రశ్నించారు. వివేకా హత్యకు ప్రత్యక్ష సాక్షిగా ఇనయ్ తుల్లా కూడా ఉన్నారని చెబుతున్నారు.


అంతేకాదు ఇప్పటికే కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్‌ రెడ్డితో పాటూ గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది. వారు ప్రస్తుతం హైదరాబాద్ చంచల్‌గూడా జైల్లో ఉండగా.. కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించింది. ఇటు ఎంపీ అవినాష్ రెడ్డిని కూడా సీబీఐ ప్రశ్నించింది. అలాగే సుప్రీం కోర్టు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్‌పై స్టే విధించగా.. ఆయన ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్‌పైనా విచారణ వాయిదా పడింది. సీబీఐ తన విచారణ కొనసాగించొచ్చని హైకోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. సీబీఐ విచారణ పూర్తి చేసేందుకు జూన్ వరకు గడువును పొడిగించింది సుప్రీం కోర్టు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa