ఏపీలో గ్రామ, వార్డు వాలంటీర్లకు బ్యాడ్ న్యూస్. అవార్డుల ప్రదాన కార్యక్రమం మరోసారి వాయిదా పడింది. ఈ నెల 5న కార్యక్రమం జరగాల్సి ఉంది.. కానీ సీఎం జగన్ పర్యటన వాయి దా పడిందని సమాచారం అందింది. మే 24న ఈ కార్యక్రమం కోసం కొవ్వూరు వస్తారని హోం మంత్రి తానేటి వనిత తెలిపారు. వాతావరణ పరిస్థి తులు, వర్షం కారణంగా ముఖ్యమంత్రి పర్యటన వాయిదా పడిందని చెప్పారు. వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని మే 24న నిర్వహిస్తామన్నారు. సీఎం పర్యటన ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడింది.
వాస్తవానికి ఈ కార్యక్రమం గత నెల ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించాలని భావించారు. కానీ ముఖ్యమంత్రి జగన్ పర్యటన ఉన్నట్టుండి వాయిదా పడింది. ఈ నెల 5న కొవ్వూరులో సీఎం పర్యటన ఉంటుందని వారం రోజుల క్రితం చెప్పారు. ఈ కార్యక్రమం కోసం భారీ ఏర్పాట్లు చేస్తుండగా.. మళ్లీ ఈలోపు ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు వాలంటీర్లకు అవార్డులు అందజేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలులో కీలకంగా ఉన్న వాలంటీర్లకు గుర్తింపును ఇచ్చేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాలంటీర్ల సేవలకు గుర్తుగా ఈ అవార్డుల్ని అందజేస్తున్నారు. ప్రతి ఏటా ఈ అవార్డులతో పాటూ సత్కారం కూడా ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా నెల రోజుల పాటూ సచివాలయాల వారీగా.. స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో సత్కార కార్యక్రమాలు నిర్వహించాలని ప్లాన్ చేశారు.
ప్రభుత్వం ఇప్పటి వరకు రెండుసార్లు ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. మూడోసారి సత్కారాలకు సిద్ధమైంది ప్రభుత్వం. అయితే ఈ ఏడాది ఉగాది సమయంలో అవార్డులు ఇవ్వాలనుకున్నారు.. కానీ అదే సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో వాయిదా పడింది. మళ్లీ ఏప్రిల్లో నిర్వహించాలని భావించారు. వాలంటీర్గా పనిచేస్తూ కనీసం ఏడాదిపాటు ఎలాంటి ఫిర్యాదులు లేని వారిని అవార్డుతో సత్కరిస్తారు.
వాలంటీర్లకు ప్రధానంగా మూడు కేటగిరీల్లో అవార్డులు అందజేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి ఐదుగురు చొప్పున వాలంటీర్లను ‘సేవా వజ్ర’ పురస్కారంతో సత్కరిస్తారు. ప్రభుత్వం వారికి రూ.30 వేల నగదుతో పాటుగా బ్యాడ్జి, మెడల్, శాలువా, సర్టిఫికెట్ అందజేస్తుంది. సేవారత్న కేటగిరీ కింద ప్రతి మండలం, మున్సిపాలిటీ నుంచి ఐదుగురు చొప్పున.. నగరపాలక సంస్థ నుంచి 10 మంది చొప్పున ఎంపిక చేస్తారు. వీరికి రూ. 20 వేల నగదుతో పాటుగా మెడల్, బ్యాడ్జి, శాలువా, సర్టిఫికెట్ ఇస్తారు. మూడో కేటగిరి సేవావిుత్ర కింది రూ.10 వేల నగదు అందజేస్తారు. వాలంటీర్లు స్థానికంగా అందిస్తున్న సేవలు.. వారి పనితీరుతో పాటూ ఆ ప్రాంత కుటుంబాల సంతృప్తిని పరిగణలోకి తీసుకుంటారు. అందుకు తగినట్లుగా అవార్డుల్ని అందజేస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa