శ్రీకాకుళం జిల్లా, కోటబొమ్మాళి మండలం, జర్జంగి సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నరసన్నపే ట కలివరపుపేట వీధికి చెందిన వాడాడ రమణ (26) అక్కడికక్కడే మృతిచెం దగా అదే వీధికి చెందిన ఇప్పిలి రమేష్ తీవ్రంగా గాయపడ్డాడు. వివరాల్లోకి వెళ్ళితే.... నరసన్నపేట నుంచి చిల్లర వ్యాపారులకు తిను బండారాలు డోర్ డెలివరీ చేసేందుకు లగేజీ ఆటోతో వెళ్తుండగా జర్జంగి సమీపంలోకి వచ్చే సరికి వర్షం పెరగడంతో తిరిగి నరసన్నపేట జర్జంగి వద్ద రోడ్డు దాటుతుండగా పలాస నుంచి విశాఖ పట్నం వెళ్తున్న కారు ఢీకొనడంతో లగేజీ ఆటో బోల్తాపడింది. ఈ ఘటనలో డ్రైవర్ రమణ అక్కడి కక్కడే మృతిచెందగా గాయపడిన వ్యాపా రి రమేష్ను చికిత్స నిమిత్తం నరసన్నపేటకు తరలిం చారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ షేక్ మహమ్మద్ ఆలీ తెలిపారు. రమణకు మూడు నెలల కిందట వివాహం జరిగిందని బంధువులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa