ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మేఘాద్రి గడ్డ డ్యామ్ లో దూకి వ్యక్తి ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 09, 2023, 03:15 PM

మేఘాద్రి గడ్డ డ్యామ్ లో దూకి ఒక వ్యక్తి మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతి చెందిన వ్యక్తి గోపాలపట్నం ప్రాంతానికి చెందిన హేమంత్ ( 35 ) గ గుర్తించారు. గోపాలపట్నం బాజీ జంక్షన్ ప్రాంతానికి చెందిన హేమంత్ గత కొన్నాళ్లుగా తీవ్ర ఆనారోగ్యాలతో బాధపడుతూ మానసికంగా ఇబ్బంది పడడంతో ఆత్మహత్య చేసుకుని ఉంటాడని స్తానికులు


బావిస్తున్నారు. సోమవారం సాయంత్రం మృతుడు హేమంత్ ద్విచక్ర వాహనం సెల్ ఫోను చెప్పులు మేఘాద్రి గడ్డ రిజర్వాయర్ వద్ద కనిపించడంతో అనుమానం వచ్చి గాలింపు చర్యలు చేపట్టడంతో మంగళవారం హేమంత్ మృతదేహం పై కనిపించింది.


ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న మృతుడు హేమంత్ కు భార్య కుమారుడు కుమార్తె ఉన్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని కేజీహెచ్ కు తరలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa