భీమిలి నియోజకవర్గం నరసాపురం గ్రామంలో రైతులకు పట్టాలు పంపిణీ కార్యక్రమం కి విచ్చేసిన మాజీ మంత్రి భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు అయిన ముత్తంశెట్టి శ్రీనివాసరావు కి సాంప్రదాయ సాంస్కృతిక నృత్యాలు తో సాదర స్వాగతం పలికిన నాయకులు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపడుతున్న ల్యాండ్ పూలింగ్ కి రైతులు స్వచ్చందంగా తమ భూములు ఇవ్వడం జరిగింది. వారికి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం మరోచోట భూమి ఇస్తామన్న హామీ ప్రకారం మంగళవారం అవంతి శ్రీనివాసరావు చేతులు మీదుగా యల్ పి సి లు రైతులకు అందివ్వడం జరిగింది. కార్యక్రమం ను ఉద్దేశించి అవంతి శ్రీనివాసరావు మాట్లాడుతూ రైతులు తమ భూమిని అయితే పండించుకుంటున్నారు గాని ఆ భూమి కి తాము హక్కుదారులమా కాదా అనే విషయం వారికి తెలియదు.
ఈ విషయం పై ప్రత్యేక దృష్టి సారించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ల్యాండ్ పూలింగ్ అనే వినూత్న కార్యక్రమం శ్రీకారం చుట్టారని దానిలో భాగంగా నరసాపురం పంచాయతీ లో కూడా ల్యాండ్ పూలింగ్ చేసి 98 మంది హక్కు దారులకు పట్టాలు అందించడం చాలా సంతోషించ దగ్గ విషయం అని నేటితో వీరు సంపూర్ణ హక్కు దారులు అయ్యారు భూములు ఇచ్చిన పేద రైతులు కు వారికి కూడా భూమి ని కేటాయించడం జరిగిందని వారికి కేటాయించిన స్థలములో ఇళ్ళు నిర్మాణం తో పాటు విద్యుత్ సరఫరా డ్రైనేజీ వ్యవస్థ సిసి రోడ్లు త్రాగునీటి సౌకర్యం అన్ని మౌళిక సదుపాయాలు నిర్మాణం చేపట్టడం జరుగుతుందని. ఈ విషయం లో అదికారులు ఎలాంటి అలసత్వం చూపకూడదని దయచేసి ఎవరూ భూములు అమ్ముకోవద్దని ఈ నాలుగు ఏళ్ళలో ఈ పంచాయతీ కి 560 కుటుంబాలకు సంక్షేమం క్రింద 4కోట్ల 50 లక్షలు అభివృద్ధి క్రింద 7 కోట్ల 30 లక్షలు ఖర్చు చేయడం జరిగిందని వైసిపి ప్రభుత్వం మాటలు తో కాక చేతలతో చేసి చూపే ప్రభుత్వం అని ప్రజలకు మంచి చేయడానికి కావాల్సింది పెద్ద వయసు అనుభవం కాదు పెద్ద మనసు ఉండాలని అది కేవలం జగన్ కే ఉందని ఇది పేదల బుడుగు బలహీన వర్గాల పార్టీ జగనన్న పాలనలో కులం మతం ప్రాంతం పార్టీ చూడకుండా ఎలాంటి వివక్ష చూపకుండా పైసా లంచం లేకుండా పాలన అందిస్తుంది కనుక పంచాయతీ ఇంకా ఎవరికైనా ఎలాంటి సమస్యలు ఉన్నా నా దృష్టి కి తీసుకురావాలని నాయకులు కూడా పాలనపై మరింత దృష్టి సారించాలని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు మండలం ముఖ్య నాయకులు సర్పంచ్ లు యంపిటిసి లు ఆయా పదవుల్లో ఉన్న వారు సచివాలయం కన్వినర్ లు గృహ సారథులు రైతులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa