కౌలు రైతుల సమస్యలపై బహిరంగ విచారణ(పబ్లిక్ హియరింగ్) కార్యక్రమాన్ని విజయవాడలోని ఎంబీ విజ్ఞాన కేంద్రంలో బుధవారం ఉదయం 10.30నుంచి సాయంత్రం 4గంటల వరకు నిర్వహించనున్నారు. రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి జ్యూరీ ప్యానెల్ సభ్యులుగా ప్రజాఉద్యమాల జాతీయ వేదిక నాయకురాలు మేథాపాట్కర్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, అఖిలభారత వ్యవసాయ, గ్రామీణ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి అజయ్కుమార్ వ్యవహరించనున్నారు. కౌలు రైతుల సమస్యలను విని, జ్యూరీ ప్యానెల్ సభ్యులు తమ తీర్పును వెలువరించనున్నారని వేదిక రాష్ట్ర కమిటీ నాయకులు విస్సా కిరణ్, కన్నెగంటి రవి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa