రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భ ర్తీ చేయకుంటే ప్రభుత్వానికి పుట్టగతులుండవని, వెంటనే ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలని ఏఐవైఎఫ్ కడప జిల్లా కార్యదర్శి ద్రావిడ సురేష్, నగర సమన్వయ కర్త కేఎస్ మైనుద్దీన్ కోరారు. మంగళవారం లక్ష్య అకాడమీలో ఉద్యోగ అభ్యర్థులతో సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..... వైసీపీ అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, అందుకోసం ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండరు ప్రకటిస్తామని చెప్పి నాలుగేళ్లు పూర్తవుతున్నా ఇంతవరకు అతీగతీ లేదని తెలిపారు. హాస్టల్లో ఉంటూ ఉద్యోగాల కోసం శిక్షణ తీసుకుంటూ ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు అన్యాయం జరుగుతోందన్నారు. ఉద్యోగ విరమణ వయసు 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచి నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం చేశారన్నారు. ఖాళీగా ఉన్న అన్ని పోస్టులకు జాబ్క్యాలెండరు విడుదల చేసి భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎఐవైఎఫ్ నాయకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa