ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాణిపాకం దేవస్థానం గో సంరక్షణకు దాత రూ. 5 లక్షలు విరాళం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 11, 2023, 12:03 PM

కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం గో సంరక్షణ ట్రస్ట్ కి చిత్తూరు జిల్లా, పులిచెర్ల మండలం, మంగళంపేట, వాస్తవ్యులు, దాత సోము ఆనంద ప్పిళ్ళై, వారి కుటుంబ సభ్యులు రూ. 5, 87, 295 రూపాయలు విలువ గల చెక్కును బుధవారం దేవస్థానం కార్యనిర్వహణధికారి వెంకటేశు కు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామివారి దర్శనం కల్పించారు. ఈ కార్యక్రమంలో సూపర్డెంట్ కోదండపాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ నాయుడు తదితరులు ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa