ఉత్తరప్రదేశ్లోని ఆలయ పట్టణం అయోధ్యలో రామాయణ్ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించి మహర్షి మహేష్ యోగి ఇన్స్టిట్యూట్ ప్రతిపాదనను యోగి ప్రభుత్వం ఆమోదించింది. శుక్రవారం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షతన జరిగిన యూపీ కేబినెట్ సమావేశంలో పరిశ్రమలు, పర్యాటక శాఖలకు సంబంధించిన పలు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. యూపీలో పారిశ్రామిక యూనిట్లు ఏర్పాటు చేసే పారిశ్రామికవేత్తలకు ఇకపై స్టాంప్ డ్యూటీలో వంద శాతం మినహాయింపు లభించనుంది.ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ & ఎంప్లాయ్మెంట్ ప్రమోషన్ విధానంలో ప్రతిపాదిత సవరణలను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. దీని కింద UPలో మెగా ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్లను నెలకొల్పేవారు అనేక సొప్స్ & రాయితీలు పొందుతారు. రాష్ట్రంలో ప్రైవేటు రంగంలో ఐదు యూనివర్సిటీల ఏర్పాటు ప్రతిపాదనకు యూపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa