ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజల పక్షాన నిలబడే రాజకీయం చేస్తున్నాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 16, 2023, 01:50 PM

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ నిర్ణయాలు చంద్రబాబుకు రాజకీయంగా ఉరితాడు లాంటివని, అందుకే తోడేళ్ల మందలా ఏకమై ప్రజాప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై దాడిచేయాలని చూస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి మేలు చేసేలా సీఎం వైయస్‌ జగన్‌ పాలన కొనసాగుతోందని, మేనిఫెస్టోలోని 98 శాతానికిపైగా హామీలు అమలు చేసి చూపించారన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ వెనుకబడిన వర్గాల అభివృద్ధి దిశగా పనిచేస్తున్నారని చెప్పారు. ప్రజల పక్షాన నిలబడే రాజకీయాన్ని రానివ్వకూడదని కుట్రపూరితంగా, దుర్మార్గంగా ప్రభుత్వంపై తోడేళ్ల మంద దాడి మొదలుపెట్టిందని మండిపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa