వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఉత్తరాంధ్రను అన్నీ విధాలా అభివృద్ధి చేసి ఆడుకొనే బాధ్యతను తీసుకుంటుందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. పార్టీ అధికారం లోకి వచ్చాక పేదల కష్టాలను తొలగించి తీరుతుందన్నారు. విశాఖను అభివృద్ధి చేస్తానని, అనకాపల్లి బెల్లం మార్కెట్కు పూర్వ వైభవం తీసుకు వస్తానని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. మాజీ మంత్రి చింతకాయల అయన్న పాత్రుడు, మాజీ ఎంఎల్ఎ పీల గోవింద సత్యనారాయణ, మాజీ ఎంఎల్సి బుద్ద నాగ జగదీశ్వర రావులతో కూడిన వాహనంపై నుండి చంద్రబాబు అశేషజనవాహినిని ఉద్దేశించి ప్రసంగించారు. అనకాపల్లి పట్టణంలో శుక్రవారం సాయంత్రం ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి జరిగిన రోడ్డు షోను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. వచ్చేది తెలుగు దేశం ప్రభుత్వమేనని, మీ కష్టాలు తొలిగించే మన ప్రభుత్వం మీకోసం సిద్ధంగా ఉందన్నారు.
ఉత్తరాంధ్ర వెనకబడిన జిల్లాలు, పేదలు, వెనకబడిన ప్రాంతాలని, ఇక్కడి ప్రజలు నీతికి నిజాయితీగా ఉంటారని అన్నారు. వైసీపీ వచ్చినప్పటి నుంచి అరాచకాలు చేస్తున్నారని, ఇక్కడ వైసీపీ గెద్దలు విశాఖపట్నంపై వాలాయన్నారు. నాలుగేళ్లలో 40 వేల కోట్ల ఆస్తులు కబ్జా చేశారన్నారు. దసపల్లా భూముల విలువే రెండు వేల కోట్లు అన్నారు. హయగ్రీవ పేదల భూమి అని, దీనిని రేడియెంట్ పేరుతో వెయ్యికోట్ల ఆస్థి కబ్జా చేసారన్నా రు. వైఎస్ అనిల్ అనే జగన్ చిన్నాన్న కొడుకు విశాఖలో 50 ఎకరాలు కొట్టేశాడని, అది ఎవడబ్బ సొత్తు అని ప్రశ్నించారు. రుషి కొండ చారిత్రాత్మకతను సర్వనాశనం చేసి అరాచకాలు పెంచేసారన్నారు. అనకాపల్లి అంటే గుర్తకు వచ్చే బెల్లం రైతు ల సమస్యలు పట్టని ప్రభుత్వం జగన్ అన్నారు. రైతులపై తప్పుడు కేసులు భరించలేమని పంట వెయ్యడమే రైతులు మానేస్తున్నారన్నారు. అనకాపల్లి బెల్లంకు పూర్వ వైభవం తెచ్చే బాధ్యత తెలుగు దేశం పార్టీదన్నారు. ఉత్తరాంధ్రను మళ్లీ ఆదుకునే బాధ్యత తెలుగు దేశం పార్టీదే నన్నారు. లోకేష్ పంచాయితీరాజ్ శాఖ మంత్రిగా వందల అవార్డులు తెచ్చారు కానీ నేడు ఒక్క అవార్డు అయినా వచ్చిం దా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనం కోసం టీడీపీని గెలిపించాలని పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa