మంగళగిరి పట్టణంలోని తెనాలి వెళ్లే మార్గంలో ఉన్న వడ్లపూడి ప్రైఓవర్ వద్ద ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు మహిళ మెడలోని పది కాసులు బంగారు నగలను తెంచుకొని పారిపోయారు. ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాల మేరకు తాడేపల్లి పరిధి లోని కుంచనపల్లి గ్రామానికి చెందిన కొమ్మిశెట్టి వెంకటేశ్వరమ్మ తన భర్తతో కలిసి మంగళగిరిలో జరిగిన వివాహానికి హాజరై శనివారం రాత్రి టీవీఎస్ మోపెడ్ పై తిరుగుప్రయాణమైన క్రమంలో వడ్లపూడి ప్లై ఓవర్ సమీపంలోకి వచ్చే సరికి వెనుక నుండి ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలోని సుమారు 10కాసులు కలిగిన మంగళసూత్రాలు, నల్లపూసల తాడును తెంచుకుని పారిపోయారు. ఆ క్రమంలో ఆమె వాహనంపై నుంచి కిందపడిపోవడంతో గాయాలయ్యాయి. అనంతరం మంగళగిరి పట్టణపోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు మంగళగిరి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa