ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హిందూపురంలో ఫ్లెక్సీ వివాదంపై ,,,ఆందోళనకు దిగిన టీడీపీ, జనసేన శ్రేణులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, May 28, 2023, 08:39 PM

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఫ్లెక్సీ వివాదంపై ఉద్రిక్తత కొనసాగుతోంది. పెత్తాందార్లకు, పేదలకు మద్య జరుగుతున్న యుద్దం అంటూ.. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ మోహన్ రెడ్డి, మహమద్ ఇక్బాల్ ఫోటోలతో.. వైసీపీ నేతలు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అయితే.. ఈ ఫ్లెక్సీలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌లను కించపరిచే విధంగా ఫొటోలు ఉన్నాయని.. టీడీపీ, జనసేన నాయకులు ఆందోళన చేపట్టారు.


ఫ్లెక్సీ వివాదం ముదిరి.. దాన్ని చించివేసేందుకు టీడీపీ, జనసేన కార్యకర్తలు ప్రయత్నించారు. అది కాస్త తీవ్ర ఉద్రిక్తతకు కారణమైంది. ఫ్లెక్సీని చించేస్తుండగా.. వైసీపీ కేడర్ అడ్డుకుంది. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. పోలీసులు ఎంట్రీ ఇచ్చి.. ఇరు వర్గాలను చెదరగొట్టారు. అయితే.. ఫ్లెక్సీని చించేశారని.. వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో టీడీపీకి చెందిన ముగ్గుర్ని, జనసేనకు చెందిన ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


ఈ 10 మందిని అదనపు జూనియర్ జడ్జి రాజ్యలక్ష్మి ముందు పోలీసులు హాజరుపర్చారు. ఈ 10 మందికీ జడ్జి రాజ్యలక్ష్మి బెయిల్ మంజూరు చేశారు. ఇదే సమయంలో.. ఫ్లెక్సీని చించివేయడానికి నిరసనగా.. వైసీపీ కార్యకర్తలు హిందూపురం పట్టణంలో భారీ ర్యాలీకి పిలుపునిచ్చారు. ఇటు తమపై అక్రమంగా కేసులు పెట్టారని జనసేన కేడర్ కూడా రోడ్డెక్కింది. దీంతో హిందూపురం పట్టణంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa