విజయవాడలోని మిషనరీస్ ఆఫ్ చారిటీ నిర్మల్ హృదయ్ భవన్ను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దంపతులు సందర్శించారు. జగన్, భారతీ దంపతులకు నిర్వాహకులు స్వాగతం పలికారు. నిర్మల్ హృదయ్లో నూతనంగా నిర్మించిన హోమ్ ఫర్ సిక్ అండ్ డైయింగ్ డెస్టిట్యూట్స్ భవనాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. ఆశ్రమంలోని మదర్ థెరిస్సా చిత్రపటానికి సీఎం జగన్ దంపతులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం నిర్మల్ హృదయ్ భవన్లోని అనాథ పిల్లలు, వృద్ధులతో ముఖ్యమంత్రి దంపతులు ఆప్యాయంగా ముచ్చటించారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత.. అనాథ పిల్లలు, వృద్ధుల కోరిక మేరకు వారితో ఫొటోలు దిగారు. జగన్ను చూడటంతో.. పిల్లలు ఆనందం వ్యక్తం చేశారు. ఓ బాలుడు అయితే.. జగన్ చేయి పట్టుకొని వదల్లేదు. అక్కడ ఉన్నంత సేపు జగన్ వెంటనే ఉన్నాడు. హృదయ్ భవన్ నుంచి జగన్ బయటకు వస్తుంటే.. అక్కడ ఉన్న పిల్లలు 'బాయ్ మావయ్య' అంటూ వీడ్కోలు పలికారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa