విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘాల నేతలు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.... ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) రద్దు హామీకి ఇప్పటి వరకు అతీగతీ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం సూచించిన 14 శాతం పెంపును కూడా అమలు చేయడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలంటూ
ఈ సందర్భంగా ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ధర్నా చౌక్ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యమ కార్యాచరణ వల్ల ఒక్క డీఏ ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. రాబోయే ఉద్యమమంతా కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులదే అని అన్నారు. ఉద్యమం చేస్తున్నామనే మళ్లీ అవినీతి నిరోధక శాఖ దాడులు మొదలయ్యాయని తెలిపారు. కార్యాలయంలో కాగితాలు కొనుగోలు చేసేందుకు కూడా డబ్బులు ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం.. ఏసీబీతో దాడులు చేయిస్తోందని మండిపడ్డారు.
ఏసీబీ దాడుల ద్వారా దాడులు చేసి ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతోందని బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆరోపించారు. చట్టబద్ధంగా రావాల్సిన వాటి కోసం అడగడం తప్పా అని ప్రశ్నించారు. ఉద్యమం తీవ్రతరం అయితే దాని బాధ్యత ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు.
84 రోజులుగా ఆందళనలు చేస్తున్నా ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదని బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ఉద్యమం ఆగాలంటే ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించాల్సిందే అని స్పష్టం చేశారు. ప్రభుత్వం 50 డిమాండ్ల పరిష్కారం మినహా ప్రత్యామ్నాయం లేదన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమం తీవ్రతరమవుతుందని వెల్లడించారు. అదే జరిగితే పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే అని అన్నారు.
ఇక, ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ప్రభుత్వ వాదనే వినిపిస్తున్నారని బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. గతంలోనే వెంకట్రామిరెడ్డి ఈ విషయాన్ని ప్రకటించారని చెప్పారు. ఉద్యోగులకు పీఆర్సీ, అరియర్లు, డీఏలు, ఇతర ఆర్థిక ప్రయోజనాలు అవసరమా లేదా అన్న విషయం వెంకట్రామిరెడ్డి తేల్చి చెప్పాలన్నారు. సచివాలయ ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలు ఉండాలా? లేదా అన్న విషయం చెప్పాలన్నారు. వెంకట్రామిరెడ్డి మాట్లాడిన విషయాలన్నీ ప్రభుత్వం మాట్లాడినట్లు గానే భావిస్తున్నామని.. ఇదంతా ప్రభుత్వ కుట్రలో భాగమే అని బొప్పరాజు వెంకటేశ్వర్లు వ్యాఖ్యలు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa