తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం కువ్వాకుల్లి గ్రామంలోని బాణాసంచా గిడ్డంగిలో బుధవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కువ్వాకుల్లికి చెందిన ముగ్గురు కార్మికులు సాధు నాగేంద్ర (26), శంకరయ్య (36), గూడుకు చెందిన ఏడుకొండలు (45) సజీవ దహనమయ్యారు. ఈ ఘటనలో గిడ్డంగి యజమాని వీరరాఘవులు, కళ్యాణ్ కుమార్కు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను సూళ్లూరుపేట ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వారి పరిస్థితి విషమంగా ఉండటంతో హుటాహుటిన తిరుపతి రుయాకు తీసుకెళ్లారు.
ఇదిలావుంటే బాణసంచా పేలుతుండటంతో గిడ్డంగి నుంచి పెద్ద ఎత్తున మంటలు వ్యాపిస్తున్నాయి. స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. సత్యవేడు సీఐ శివకుమార్రెడ్డి, ఎస్సై పురుషోత్తం రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపడుతున్నారు. మందు తయారీ సమయంలో ప్రమాదం జరిగిందా? వేరే ఏమైనా కారణాలున్నాయా అని పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa