ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం డిల్లీకిి వెళ్లినపుడల్లా ఆ కేసుకు బ్రేక్.... టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 31, 2023, 09:41 PM

సీఎం జగన్ ఢిల్లీ వెళ్లినప్పుడల్లా అవినాశ్ రెడ్డి కేసు అంశానికి బ్రేకులు పడుతున్నాయని టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి 


 ఆరోపించారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డిది అంతులేని కథ అని ఆయన  విమర్శలు గుప్పించారు. హత్యా రాజకీయాలను ప్రోత్సహించడం ఏమిటని మండిపడ్డారు. జగన్ పాలన గురించి గోరంట్ల మాట్లాడుతూ... ఆయన అరాచకాలకు సెలవు చెప్పాలని రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు.


టీడీపీ తొలి విడత మేనిఫెస్టోను ప్రజలు ఆదరిస్తారని, దసరాకు పూర్తిస్థాయి మేనిఫెస్టో వస్తుందని చెప్పారు. మహానాడు బ్యానర్లు కట్టుకుంటే మధ్యలో ఎంపీ భరత్ వచ్చి వైసీపీ ఫ్లెక్సీలు కడుతున్నారని ధ్వజమెత్తారు. పైగా మాపైనే కేసులు పెడుతున్నారన్నారు. రాజమహేంద్రవరంలో అధికారులతో కలిసి ఎంపీ ఆడుకుంటున్నారని ధ్వజమెత్తారు. పోలీసులు చుట్టూ లేకుండా వైసీపీ నేతలు ఎవరైనా బయటకు రాగలరా అని సవాల్ విసిరారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa