ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరకట్ట నివాసం జఫ్తు పిటిషన్‌పై ముగిసిన వాదనలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 31, 2023, 09:44 PM

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు కరకట్ట నివాసం జఫ్తు పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. న్యాయమూర్తి బిందుమాధవి ఇరువైపుల వాదనలు విన్నారు. జూన్ 2న తీర్పును వెలువరించనున్నారు. కరకట్టపై చంద్రబాబు ఇల్లు జఫ్తు చేసేందుకు అనుమతి కోరుతూ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. టీడీపీ హయాంలో సీఆర్డీఏ మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్‌లలో లింగమనేనికి  లబ్ధి చేకూర్చారని, దానికి బదులుగా ఆయన ఇంటిని గెస్ట్ హౌస్ గా చంద్రబాబు పొందినట్లు సీఐడీ అభియోగాలు మోపింది. ఈ నేపథ్యంలో కరకట్టపై చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని ఇంటి జఫ్తుకు అనుమతి కోరింది సీఐడీ. దీనిపై వాదనలు విన్న న్యాయమూర్తి ఎల్లుండి తీర్పు వెలువరించనున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa