తల్లి మనసుతో ఆలోచిస్తూ, తండ్రిలా బాధ్యత తీసుకొని రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి మేలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అని పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. సచివాలయం, వలంటీర్ వ్యవస్థను నెలకొల్పి పరిపాలనను ప్రజల గుమ్మం వద్దకు చేర్చారని చెప్పారు. సచివాలయ వ్యవస్థ ద్వారా 722 సేవలను ప్రజలు ఉచితంగా అందుకుంటున్నారని చెప్పారు. పాదయాత్రలో తాను చూసిన ప్రజల సమస్యలను అధికారంలోకి వచ్చిన తరువాత పరిష్కరిస్తున్నారని చెప్పారు. దేశంలో ఉన్న ప్రతి ముఖ్యమంత్రి, ప్రతి నాయకుడు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలి.. మేనిఫెస్టో ఎంత పవిత్రమైనదో తెలుసుకునేలా చేసిన నాయకుడు సీఎం వైయస్ జగన్ అని మంత్రి రోజా అన్నారు. తిరుపతిలో మంత్రి రోజా విలేకరుల సమావేశం నిర్వహించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa