ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాతికి గురిచేసింది: పవన్ కళ్యాణ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 03, 2023, 09:52 PM

ఒడిశా రైలు ప్రమాదంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. బాలేశ్వర్ సమీపంలో చోటు చేసుకున్న ఈ ఘోరం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు. 278 మంది ప్రయాణికులు మృత్యువాతపడటం దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని తెలిపారు.  ప్రమాదానికి గురైన కోరమాండల్ ఎక్స్ ప్రెస్, బెంగళూరు – హౌరా సూపర్ ఫాస్ట్ రైళ్లలో తెలుగు రాష్ట్రాల ప్రయాణికులు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని సమాచారం అందుతోందని పవన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు బాధిత ప్రయాణికులు, వారి కుటుంబాలకు సాయం అందించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ దుర్ఘటన నేపథ్యంలో రైలు ప్రమాదాల నివారణ కోసం భద్రతా చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa