జనసేన టీడీపీ పార్టీలు పరస్పర పొత్తు ఖరారైతే మంగళగిరి అసెంబ్లీ టికెట్ ను జనసేన కి కేటాయించాలని తాను మొదటి నుంచి అడుగుతున్నానని ఆ పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. గురువారం మంగళగిరిలోని గౌతమ బుద్ధ రోడ్డు వెంబడి గల జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలో చేనేత సామాజిక వర్గం బలంగా ఉందని తెలిపారు. టిడిపి జనసేన ల మధ్య పొత్తు కుదిరితే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తామని, ఆ తర్వాత మేయర్ టిక్కెట్ కూడా ఇవ్వాలని అభ్యర్థిస్తామని తెలిపారు.
జనసేన తరపున తాను ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగాలని మొదటి నుంచి ఆశిస్తున్నట్లు చెప్పారు. ఒకవేళ పార్టీకి టికెట్ ను కేటాయించని పక్షంలో భవిష్యత్తు పరిణామాలను బట్టి నిర్ణయం తీసుకుంటానని వ్యాఖ్యానించారు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 2019లో మంగళగిరి నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. రానున్న ఎన్నికల్లో మంగళగిరిలో గెలిచి చంద్రబాబుకు బహుమతిగా ఇస్తానని లోకేష్ ఇప్పటికే పలుమార్లు వెల్లడించారు. ఇందుకు తగినట్లుగా పెద్ద ఎత్తున నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలకు సొంత నిధులు వెచ్చిస్తున్నారు. జనసేనతో టిడిపి పొత్తు కుదిరితే మంగళగిరి టికెట్ ఒప్పందంలో భాగంగా ఏ పార్టీని వరిస్తుందో వేచి చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa