ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వారిని విచారించకపోతే వాస్తవాలు వెలుగులోకిి రావు.... ఎంపీ రఘురామకృష్ణరాజు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 09, 2023, 09:58 PM

సొంతపార్టీపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సందర్బం వచ్చినప్పుడల్లా ఎదురుదాడికి దిగుతున్నారు. ఇదిలావుంటే  వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డిని ఏ8 నిందితుడిగా సీబీఐ చేర్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ ఈ కేసులో ఏ9 ఎవరనేది ఇప్పుడు అత్యంత ఆసక్తికరమైన విషయమని అన్నారు. సీఎం జగన్, ఆయన భార్య వైఎస్ భారతిని విచారించకపోతే ఈ కేసుకు సంబంధించి ఎలాంటి వాస్తవాలు బయటకు రావని అన్నారు. 


వివేకా హత్య గురించి జగన్ కు ముందే తెలుసని సీబీఐ చెప్పిందని... ఈ విషయం జగన్, భారతికి ముందే ఎలా తెలుసని ప్రశ్నించారు. ఫోన్ ద్వారా వారు ఎవరితో మాట్లాడారో తెలియల్సి ఉందని అన్నారు. మరోవైపు అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ సునీత వేసిన పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు మంగళవారానికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. 







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa