ట్రెండింగ్
Epaper    English    தமிழ்

14 రోజులు అసెంబ్లీ సమావేశాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 07, 2017, 01:18 AM

విజయవాడ నుంచి ప్రత్యేక ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ సమావేశాలను 14 రోజుల పనిదినాలు పాటు నిర్వహించాలని బీఏసీ సమావేశం నిర్ణయించింది. సోమవారం నాడు అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగం అనంతరం స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు అధ్యక్షతన జరిగిన బిజినెస్‌ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో  టీడీపీ నుంచి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృషూ్ణడు, విప్‌ కాల్వ శ్రీనివాసులు హాజరు అయ్యారు.  వైసీపీ నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీకాంత్‌ రెడ్డిలు, బీజేపీ విషూ్ణకుమార్‌ రాజు, కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య హాజరయ్యారు. ప్రధానంగా సభను 14 రోజుల పాటు నిర్వహించాలని తీర్మానించారు. ప్రతిపక్ష సభ్యులు 40 రోజులు నిర్వహించి కనీసం 42 అంశాలు చర్చించాలని కోరారు. చివరిలో రెండు సెషన్‌ నిర్వహించడానికి బిఏసీ తీర్మానించింది. టిడిపీ 22 అంశాలు చర్చించాలని నిర్ణయం తీసుకుంది. మార్‌‌చ 8, 9 10, 11, 12 సెలవులు కాగా 13 న ఆర్ధిక మంత్రి బడ్జెట్‌ ప్రవేశ పెడతారు ...14 న గవర్నర్‌ ప్రసంగం ఫై  చర్చిస్తారు .15 నుంచి పద్దులు ఫై చర్చ ఉంటుంది 17 న శాసన మండలి ఎన్నిక వల్ల సెలవు ఉంది.ఐతే 42 అంశాల మాట్లాడునీకి సమయాన్ని పెంచాలనో కోరిన టిడిపి ఒప్పుకోలేదు అని వైసీపీ చెప్తోంది. అసెంబ్లీ లో చర్చించే అంశాల కంటే ప్రధాన అంశాలు ఉనాయని యనమల చేపడ్డం ఫై ప్రతి పక్షం అగ్రహించింది. ఈ సందర్భంగా బీఏసీ సమావేశంలో కొంత ఆసక్తికరమైన చర్చ సాగింది. అసెంబ్లీ సమావేశాలు నిర్వహణ విషయంలో వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. కేవలం 13 రోజులు అసెంబ్లీ నిర్వహించాలని ప్రభుత్వం కు్ట్ర చేస్తుందని ఆరోపించారు. మరో 10 రోజులు సమావేశం పొడిగించాలని డిమాండ్గ చేశారు. 25 ఏళ్లలో తాను ఎప్పుడూ 13 రోజులు బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించిన పరిస్థితి ఎన్నడూ చూడలేదన్నారు. ప్రజా సమస్యలకన్నా ఇతర సమస్యలు ఉన్నాయని మంత్రి యనమల అన్న మాటలు ప్రభుత్వ మాటలుగా భావిస్తున్నామన్నారు. మరో వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి సైతం ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. బీఏసీ సమావేశం నిర్వహించారు గానీ ప్రజాసమస్యలపై మాట్లాడితే మాకు వేరే పనులు ఉన్నాయని ప్రభుత్వం చెప్పడం వింతగా ఉందన్నారు. సౌకర్యాలపై మాట్లాడడం పెద్ద గొప్ప కాదు, ప్రజాసమస్యలపై చర్చించాలన్నారు. 43 అంశాలపై మా పార్టీ తరపున చర్చకు పెట్టామని, ధైర్యముంటే ఆ అంశాలపై మాట్లాడాలని డిమాండ్గ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, కరువు, రాజధాని, మహిళల భద్రత, ఆరోగ్యశ్రీ, క్రైమ్‌ రేటు, అగ్రిగోల్‌‌డ, కాపు రిజర్వేషన్‌, పుష్కరాలు, అవినీతి, ఈపాస్‌ లోపాలు, ఉద్యోగ అవకాశాలు, ఎస్సీఎస్టీ సబ్‌ప్లాన్‌, చేనేత, విద్యుత్‌ చార్జీలు, విదేశీ పర్యటన, స్థానిక సంస్థలు, బాకై్సట్‌, ప్రైవేట్‌ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, మైనింగ్‌, స్వచ్ఛభారత్‌, బీసీ సమస్యలు, ప్రైవేట్‌ ట్రావెల్‌‌స ఇలా అంశాలపై ఎందుకు మాట్లాడారని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం రాసిచ్చింది గవర్నర్‌ చదివారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ అవినీతిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. గవర్నర్‌ ప్రసంగ పత్రాలు కరప్త్రంగా ఉన్నాయన్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య మాట్లాడుతూ బిల్డింగ్‌లు అందగా ఉంటే సరిపోదు, ప్రజాసమస్యలపై సమర్థవంతంగా చర్చ జరగాలని డిమాండ్‌ చేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa