కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగంపై వైసీపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్యనారు. అమిత్ షా ప్రసంగమంతా అంతా టీడీపీ కనుసన్నల్లోనే జరిగిందని.. వైసీపీ ముఖ్యనేత వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. విశాఖ అభివృద్ధి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి అమిత్ షా మాట్లాడకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. 2014 నుంచి 2019 వరకు జరిగిన అక్రమాలపై అమిత్ షా ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఏపీకి న్యాయంగా రావాల్సిన నిధులు, హక్కుల గురించి ఎందుకు మాట్లాడలేదని.. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు.
'జగన్ నాలుగేళ్ల పాలనలో అవినీతి ఆరోపణలు, కుంభకోణాలు తప్ప మరేమీ లేదు. మన్మోహన్ హయాంలో అవినీతి జరిగినా చర్య తీసుకునే సత్తా లేకపోయింది. పుల్వామా ఘటన జరిగిన 10 రోజుల్లోనే ప్రతీకారం తీర్చుకున్నాం. సర్జికల్ స్ట్రైక్తో పాక్కు బుద్ధిచెప్పాం. ఏపీలో పేదలకు పంచుతున్న బియ్యం మోదీ ఇచ్చినవే. కేంద్రం ఇస్తున్న బియ్యం తామే ఇస్తున్నట్లు జగన్ ఫొటో వేసుకుంటున్నారు. ప్రపంచ దేశాలు మోదీ జపం చేస్తున్నాయి. నరేంద్ర మోదీ బీజేపీకి చెందిన వ్యక్తి కాదు. 131 కోట్ల మందికి దక్కుతున్న గౌరవం' అని విశాఖలో అమిత్ షా వ్యాఖ్యానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa