ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నల్ల బెలూన్లతో సీఎం జగన్ కు నిరసన తెలియజేసిన మహిళలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 16, 2023, 09:02 PM

గుడివాడకు వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నిరసన వ్యక్తం అయింది. టిడ్కో ఇళ్ల పరిశీలన కోసం ఏపీ ముఖ్యమంత్రి జగన్ గుడివాడకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు నిరసన సెగ తగిలింది. నల్ల బెలూన్లను వదిలి మహిళలు నిరసన వ్యక్తం చేశారు. గో బ్యాక్ సీఎం, సైకో సీఎం అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నిరసన వ్యక్తం చేసిన మహిళలు మాట్లాడుతూ... చంద్రబాబు కట్టించిన 8,912 టిడ్కో ఇళ్లను చూసేందుకు రావడం లేదని, ఆయన తండ్రి వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు వస్తున్నారని విమర్శించారు. జగన్ పర్యటనను నిరసిస్తూ చాలా మంది మహిళలు సభాస్థలికి వస్తుండగా పోలీసులు అడ్డుకున్నారని... అందుకే ఇక్కడి నుంచే నిరసన వ్యక్తం చేస్తున్నామని చెప్పారు. గోబ్యాక్ సీఎం, సైకో సీఎం అంటూ నల్ల బెలూన్లను గాల్లోకి వదిలారు. జగన్ హెలికాప్టర్ ఆ ప్రాంతంలోకి వచ్చిన సమయంలోనే బెలూన్లను ఎగురవేశారు. మరోవైపు జగన్ పర్యటన సందర్భంగా ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa