రాష్ట్రవ్యాప్తంగా కారుణ్య నియామకాలు భర్తీ ప్రక్రియ చేపట్టినట్లు ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఔదార్యంతో 2016 జనవరి నుంచి 2019 డిసెంబర్ మధ్య కాలంలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. కారుణ్య నియామకాల కింద 294 మందికి ఉద్యోగ అవకాశం కల్పించనున్నట్లు ద్వారకా తిరుమలరావు అన్నారు. కారుణ్య నియామకాల కింద 34 మంది జూనియర్ అసిస్టెంట్లు, 99 మంది ఆర్టీసీ కానిస్టేబుల్స్, 99 మంది అసిస్టెంట్ మెకానిక్లు, 61 మంది కండక్టర్లు, ఒక డ్రైవర్ పోస్టులు భర్తీ చేయనున్నారు.
మరోవైపు, ఏపీఎస్ ఆర్టీసీ విద్యాధరపురం ట్రాన్స్పోర్ట్ అకాడమీలో ఉద్యోగాలు పొందిన వారికి శిక్షణ తరగతులు ప్రారంభం అయ్యాయి. ఈ శిక్షణా తరగతులు ప్రారంభోత్సవానికి సంస్థ ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమల రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగులు క్రమశిక్షణ, అంకితభావంతో పని చేయాలని సూచించారు. ఉద్యోగాలు పొందినవారికి 3 నెలల పాటు శిక్షణ ఇస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (అడ్మిన్) కేఎస్ బ్రహ్మానంద రెడ్డి తెలిపారు. శిక్షణా కాలంలో ఉద్యోగులకు స్టైఫండ్ ఇవ్వనున్నట్లు వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa