సమాజంలో అసమానతలు పోవాలంటే విద్య ఒక్కటే మార్గమని నమ్మి విద్యకు పెద్ద పీట వేసిన ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కే దక్కుతుందని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తెలియజేసారు. కులాలకు మతాలకు రాజకీయాలకు అతీతంగా పేదరికం ఒకటే ప్రామాణికంగా ప్రభుత్వ నిబంధనలకు లోబడి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా 15000 రూపాయలు ప్రతి సంవత్సరం ప్రభుత్వం అందజేస్తున్నట్లు తెలిపారు. విద్యతోనే అభివృద్ధి సాధ్యమని విద్యారంగంలో అనేక మార్పులు తీసుకొని వచ్చి పేద విద్యార్థుల అభ్యున్నతి కొరకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఎంతగానో కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా సుమారు42 ,61 ,9 6 5 మంది తల్లుల ఖాతాల్లో రూ.6,3 93.94 కోట్లు జమ చేయడం జరుగుతున్న దన్నారు. ముఖ్యంగా పేదరికంతో ఏ ఒక్క పిల్లవాడు విద్యకు దూరం కాకూడదన్న మంచి ఆలోచనతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం కోసం కోట్లాది రూపాయలు విద్యా రంగానికి ప్రభుత్వం ఖర్చు పెడుతున్నదని అందువల్ల విద్యార్థులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ప్రస్తుతం గతం కంటే మిన్నగా కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలు రూపు దిద్దుకుంటున్నాయన్నారు. అందువల్ల ఇప్పటినుండే పిల్లలందరూ కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఎమ్మెల్యే విద్యార్థులకు సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa