ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాడ వాడ ప్రచారం చేస్తున్న దేవినేని ఉమా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 30, 2023, 01:57 PM

ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరం పట్టణంలో టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పర్యటన మూడో రోజు కొనసాగుతోంది. భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు  ప్రకటించిన మినీ మేనిఫెస్టోను దేవినేని ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. పట్టణంలోని పెద్ద దళితవాడ, శాంతినగర్, బాలయోగినగర్‌లలో ఇంటింటికి తిరుగుతూ మేనిఫెస్టో కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా దేవినేని మాట్లాడుతూ.. మైలవరం దళితవాడ చూస్తే ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందని.. పంచాయతీలు ఎలా పనిచేస్తున్నాయో అర్థం అవుతోందన్నారు. అధ్వానంగా పారిశుద్ధ్యం ఉందని.. ఐదు రోజుల నుంచి మంచినీళ్లు లేవని పట్టించుకునే నాధుడు లేడని, మంచినీళ్లు కొనుక్కునే పరిస్థితి తీసుకొచ్చారని ఆయన మండిపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa