ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కసరత్తు మొదలెట్టిన చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 30, 2023, 02:05 PM

రానున్న ఎన్నికల్లో టీడీపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు  స్పీడ్ పెంచారు. త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో త్వరత్వరగా నియోజకవర్గాలకు ఇన్‌చార్జిలను ఫైనల్ చేసే పనిలోపడ్డారు. ఇన్‌చార్జ్‌లంతా ప్రజల్లోనే ఉండాలంటూ అధినేత దిశానిర్దేశం చేశారు. సీట్ల ఖరారుపై చంద్రబాబు ముమ్మర కసరత్తు చేపట్టారు. ఇన్‌చార్జ్‌లను ఖరారు చేస్తూ నిర్ణయాలు తీసుకున్నారు. రేసులో ఉన్న పలువురికి పార్టీ పదవులు, ఎమ్మెల్సీ హామీలు ఇచ్చారు. ఇందులో భాగంగా నెల్లూరు సిటీ అసెంబ్లీ ఇన్‌చార్జిగా మాజీ మంత్రి నారాయణను  నియమించారు. ప్రస్తుతం నెల్లూరు అసెంబ్లీ ఇన్‌చార్జిగా ఉన్న కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డిని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియామిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రానున్న రోజుల్లో ఎమ్మెల్సీ ఇస్తామని కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డికి చంద్రబాబు హామీ ఇచ్చారు. ఎస్.కోట స్థానం ఆశిస్తోన్న గొంప కృష్ణకు రాష్ట్ర కార్యదర్శి పదవిని కట్టబెట్టనున్నారు. నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలను గొంప కృష్ణ తరచూ నిర్వహిస్తూ వస్తున్నారు. త్వరలో గొంప కృష్ణకు ఇంచార్జి పదవి లభించే అవకాశం ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa