నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో లోకేశ్ యువగళం పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 145 రోజుల్లో 1892.6 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగింది. ఇవాళ సాయంత్రం నెల్లూరు సిటీలోకి యువగళం పాదయాత్ర ప్రవేశించనుంది. వీఆర్సీ సెంటర్లో భారీ బహిరంగ సభలో యువనేత పాల్గొననున్నారు. అనిల్ గార్డెన్స్ నుంచి కేవీఆర్, ఆర్టీసీ, మద్రాసు బస్టాండు, వీఆర్సీ, గాంధీబొమ్మ, కనకమహల్, బోసుబొమ్మ, ఆత్మకూరు బస్టాండు, స్టౌన్ హౌస్ పేట, పప్పుల వీధి, శెట్టిగుంట రోడ్డు, పెన్నా బ్రిడ్జి, వెంకటేశ్వరపురం సెంటర్ల మీదుగా సాలుచింతల వరకు లోకేశ్ యువగళం పాదయాత్ర కొనసాగనుంది. ఈరోజు రాత్రి సాలుచింతలలో యువనేత బస చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa