ఏలూరులో జరిగిన వారాహి విజయ యాత్ర సభకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. తాను సరదా కోసం రాజకీయాల్లోకి రాలేదని పవన్ కళ్యాణ్ అన్నారు. నేను ఇన్ని బాధలు, అవమానాలు ఎందుకు పడాలి? గెలుపోటములతో పనిలేకుండా ప్రజల భవిష్యత్తు కోసం పనిచేసేందుకే రాజకీయాల్లోకి వచ్చాను అని వివరించారు. అందరికీ సమానం అనే అంబేద్కర్ స్ఫూర్తి తనను రాజకీయాల్లోకి తీసుకొచ్చిందని అన్నారు. ఈ రాష్ట్ర సీఎం జగన్ మంచివాడా, చెడ్డవాడా అని చూడకుండా, సీఎం స్థానానికి విలువ ఇచ్చి జగన్ రెడ్డి గారు అని గౌరవించానని తెలిపారు. అయితే, ఈ రోజు నుండి అంబేద్కర్ సాక్షిగా జగన్ రెడ్డిని ఏకవచనంతోనే పిలుస్తానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. జగన్ ముఖ్యమంత్రి పదవికి అనర్హుడని వ్యాఖ్యానించారు.2024లో రాష్ట్రానికి జగన్, వైసీపీ పార్టీ అవసరం లేదన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa