కేంద్ర వ్యవసాయ శాఖ నుంచి అవార్డును అందుకున్న అధికారులను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. వందశాతం సూక్ష్మ సేద్యాన్ని అమలు చేస్తూ ఉత్తమ యాజమాన్య పద్ధతులతో అధిక దిగుబడులు సాధించినందుకుగాను వైయస్ఆర్ జిల్లా ఇ. కొత్తపల్లి పంచాయతీకి కేంద్ర వ్యవసాయశాఖ అవార్డును అందించింది. ఆ అవార్డును సూక్ష్మనీటి పథకం పీఓ సీబీ హరినాథ్రెడ్డి, వ్యవసాయశాఖ అధికారులు ముఖ్యమంత్రి వైయస్ జగన్కు అందించారు. ఈ సందర్భంగా అధికారుల సేవలను సీఎం వైయస్ జగన్ ప్రశంసించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa