ఏపీలో నేడు పలు జిల్లాలకు వాతావరణశాఖ వర్షసూచన జారీ చేసింది. ఉత్తరాంధ్ర, రాయలసీమలోని అనేక జిల్లాల్లో రాబోయే నాలుగు రోజులు వర్షాలు పడే అవకాశముందని అంచనా వేసింది. ఏపీలో ఇప్పటికే వర్షాలు పడుతుండగా.. రానున్న నాలుగు రోజుల పాటు కూడా కొనసాగనున్నాయి. రాబోయే నాలుగు రోజుల్లో అనేక జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడనున్నట్లు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. నేటి నుంచి 19వ తేదీ వరకు వానలు కురవనున్నాయి. నేడు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనుండగా.. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, కోనసీమ, వెస్ట్ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, కర్నూలు, నంద్యాల జిలాల్లో స్వల్ప వర్షాలు పడనున్నట్లు వాతావరణశాఖ స్పష్టం చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa