రాష్ట్రంలోని ఎవరు ప్రశాంతంగా ఉండే పరిస్థితి లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు.ఏఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... అన్ని జిల్లాల నుంచి వచ్చిన పార్టీ నేతలను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. ‘‘రాష్ట్రం అరాచకాంధ్రను తలపిస్తోంది. అత్యాచారాలు, హత్యలు, మద్యం మాఫియా, మైనింగ్ మాఫియా, భూ కబ్జాలు, ప్రశ్నిస్తే దాడులు. ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన జగన్ రూ.10 లక్షల కోట్ల అప్పు 5కోట్ల మంది నెత్తిన పెట్టారు. ధరలు, పన్నుల బాదుడుతో ప్రజల్ని పీల్చి పిప్పిచేస్తున్నారు. ఇలాంటి సమయంలో బీజేపీ ప్రజల పక్షాన నిలబడాలి. నాతో సహా ప్రతి కార్యకర్త గట్టిగా పనిచేయాల్సిందే. వైసీపీ మేనిఫెస్టో ప్రతి ఒక్కరూ చదవాలి. అందులో అమలు చేయని వాటిని డిమాండ్ చేస్తూ కార్యాచరణ సిద్ధం చేయాలి అని తెలియజేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa