విజయవాడ ధర్నా చౌక్లో మహిళల ఆత్మ గౌరవ దీక్ష శుక్రవారం మొదలైంది. మహిళా ద్రోహి జగన్ పేరిట టీడీపీ నేత వంగలపూడి అనిత ఆధ్వర్యంలో తెలుగు మహిళలు నిరసన దీక్షకు దిగారు. రాష్ట్రంలో మహిళలకు వైసీపీ ప్రభుత్వం కనీస రక్షణ కల్పించలేకపోతోందంటూ మహిళల నిరసన తెలిపారు. తెలుగు మహిళల నిరసన దీక్షకు అఖిల పక్ష, వివిధ మహిళా సంఘాలు మద్దతు తెలిపారు. నిరసన దీక్షకు మద్దతు తెలపాలంటూ వైఎస్ భారతీ, వాసిరెడ్డి పద్మలకు తెలుగు మహిళలు ఆహ్వానం పంపారు. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు, అవమానాలు పెరుగుతుంటే, ప్రభుత్వం శుక్రవారం మహిళా ఆత్మగౌరవ దినోత్సవం జరుపుతామనటం దురదృష్టకరమంటూ మహిళలు నిరసన చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa