కర్నూలు జిల్లా, ఓర్వకల్లు మండలంలోని గుమితం తండా సమీపాన నిర్మిస్తున్న జలవిద్యుత్ పవర్ ప్రాజెక్టు వద్ద ఎక్స్కవేటర్ బకట్ తగిలి బీహార్ వాసి మృతి చెందాడు. జలవిద్యుత్ పవర్ ప్రాజె క్టులో బుధవారం రాత్రి 11 గంటల సమయంలో ఎక్స్కవేటర్ ఆపరే టర్ నిర్లక్ష్యం వల్ల బీహార్ రాష్ట్రం వెస్ట్ చంపారన్ జిల్లాకు చెందిన సురేందర్ మహతో (43) మృత్యువాత పడ్డాడు. సురేందర్ మహతో తలకు ఎక్స్కవేటర్ బకెట్ తగిలి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొం దుతూ మృతి చెందినట్లు ఎస్ఐ రాజారెడ్డి తెలిపారు. మృతుని చిన్నా న్న, తల్లి మహతో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యా ప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అయితే పవర్ ప్రాజెక్టులో కార్మికుడు మృతి చెందడంతో తోటి కార్మికులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. యాజమాన్యం కార్మికులకు సర్దిచెప్పి నిరసనను విరమింపజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa