తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర గురువారం ప్రకాశం జిల్లా కనిగిరిలోని శంఖవరం నుంచి పట్టణంలోని బస్టాండ్ సెంటర్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ...... యువగళంను అడ్డుకునేందుకు జగన్ కొత్త డ్రామాలు మొదలు పెట్టారన్నారు. ‘యాత్రకు ఐప్యాక్ యూనిట్ను పంపారు. మావాళ్లు పట్టేశారు. యువగళం మొత్తం లైవ్లో వస్తుంది. సైకో జగన్ అది చూస్కో. ఇక్కడకు వచ్చి ఐప్యాక్ ఏం పీకుతుంది?’ అని ప్రశ్నించారు. ‘ఏదో విధంగా పాదయాత్రను అడ్డుకోవాలని జగన్ ఇచ్చిన ఆదేశాలతో సజ్జల వైసీపీ ఎమ్మెల్యేలను రంగంలోకి దించారు. అర్ధరాత్రి దొంగల్లా ఫ్లెక్సీలు వేశారు. అదే మేము ఫ్లెక్సీలు పెడితే జగన్కు గుండె పోటు వస్తుంది’ అని హెచ్చరించారు. కనిగిరి సభకు ప్రజలు ఆటోల్లో వస్తుంటే ఒక్కో ఆటోకు రవాణా శాఖ అధికారులు రూ.20వేలు ఫైన్ వేశారని లోకేశ్ ధ్వజమెత్తారు. ఒక్క రూపాయి కట్టొద్దని, టీడీపీ అధికారంలోకి రాగానే ఆ దొంగ చలానాలు రద్దు చేస్తామని అన్నారు. ‘మమ్మల్ని గెలకొద్దు జగన్. నీకు నిద్ర రాకుండా చేస్తాం. నీకు ముందే చెప్పా సాగనిస్తే పాదయాత్ర.. అడ్డుకుంటే దండయాత్ర అని. కానీ ఇప్పుడు స్లోగన్ మార్చా సాగనిస్తే పాదయాత్ర.. అడ్డుకుంటే వైసీపీకి అంతిమయాత్ర’ అని లోకేశ్ ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa