టీటీడీ శ్రీవాణి ట్రస్ట్, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి కీలక ప్రకటన చేసింది. అక్టోబర్ నెలకు సంబంధించిన శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల కోటాను ఈ నెల 24న ఉదయం 11 గంటలకు ఆన్ లైన్లో విడుదల చేయనున్నట్లు తెలిపింది. 24న మధ్యహ్నం 3 గంటలకు అక్టోబర్ నెలకు సంబంధించి వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్ల కోటాను విడుదల చేయనుంది.
మరోవైపు ఈ నెల 25న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. ఆగస్ట్, సెప్టెంబర్ నెలలకు సంబంధించి రోజుకి అదనపు కోటా కింద 4 వేల టికెట్లను విడుదల చేస్తారు. అక్టోబర్ నెలకు సంబంధించి రోజుకి 15 వేల టికెట్ల చొప్పున విడుదల చేయనున్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి బుక్ చేసుకోవాలని సూచించింది.
తిరుమలలో ఇవాళ భక్తుల రద్దీ బాగా పెరిగింది. వారాంతం కావడంతో భక్తులతో క్యూ కాంప్లెక్స్లోని కంపార్టుమెంట్లన్నీ నిండి క్యూలైన్లు వెలుపలికి వచ్చాయి. ఇక స్వామివారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. గురువారం 63,628 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా.. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.26 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది. స్వామివారికి 33,548 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa