వలంటీర్లపై ఆరోపణలు చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరును మంత్రి గుడివాడ అమర్నాథ్ ట్విట్టర్ వేదికగా ఎండగట్టారు. ప్యాకేజీ స్టార్.. పవన్ కళ్యాణ్ నువ్వు చెప్పిన వాలంటీర్లు గత నాలుగు సంవత్సరాలుగా ప్రజలకు పింఛన్ అందిస్తున్నారు. వారికి అవసరమైన ప్రభుత్వ సర్టిఫికెట్లు అందిస్తున్నారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించారు. వ్యాక్సినేషన్పై ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించారు. అప్పుడు నువ్వు, నీ గురువు చంద్రబాబు హైద్రాబాద్లో ముసుగుతన్ని పడుకున్నారు. ఆరోజు తెలియలేదా వాలంటీర్లకు బాస్ ఎవరు? . ఎవరు చెప్తే వారు ప్రజలకు మంచి చేస్తున్నారు? . వారు ఏ మంత్రిత్వ శాఖ కిందకు వస్తారు అని? ఇప్పుడు వారిపై నిందలు వేయడానికి తయారయ్యావు. వాలంటీర్లు చేసే మంచి ఏంటో వారి వల్ల లబ్ధిపొందుతున్న ప్రజలను నేరుగా అడుగు తెలుస్తుంది. అంతే తప్ప లారీ ఎక్కి ఊగిపోయి మాట్లాడితేనో.. ఇలా ట్వీట్లు పెడితేనో ఎలా తెలుస్తుంది? అంటూ మంత్రి ట్వీట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa