గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సమగ్ర సర్వే, డిజిటల్ లైబ్రరీల నిర్మాణంపై దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్మోహన్రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో స్వయం ఉపాధిని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలన్నారు. లబ్ధిదారులు తొలి విడత డబ్బు అందుకున్నప్పుడే స్వయం ఉపాధి కార్యక్రమానికి అనుసంధానం చేస్తే ఆ మహిళకు పూర్తిస్థాయిలో మేలు జరుగుతుందని పేర్కొన్నారు.
గ్రామీణాభివృద్ధి శాఖ కింద చేపట్టే ఉపాధి కార్యక్రమాలపై నిరంతరం సమీక్ష చేయాలని సీఎం జగన్ అన్నారు. ఆ కార్యక్రమాల పనితీరుపై మదింపు చేసేందుకు శాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. నివేదికల ఆధారంగా ఆ యూనిట్లు విజయవంతంగా నడిచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ సూచించారు.
జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్ష పథకం విశిష్టమైనదని, ప్రతి గ్రామ సచివాలయంలో సర్వేయర్ను నియమించడంవల్ల ఈ ప్రాజెక్టు సజావుగా ముందుకు సాగుతోందని సీఎం జగన్ అన్నారు. అలాగే, గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు కూడా ప్రారంభించిన ఘనత మన రాష్ట్రానికే దక్కుతుందని చెప్పారు. జగనన్న కాలనీలపై అధికారులు ప్రత్యేకంగా దృష్టిపెట్టాలన్నారు. మౌలిక సదుపాయాల దగ్గర నుంచి ప్రతి అంశంలోనూ ప్రత్యేక శ్రద్ధపెట్టాలని ఆదేశించారు.
జగనన్న కాలనీలను ఆహ్లాదంగా, పరిశుభ్రంగా ఉంచేందుకు అన్ని చర్యలూ తీసుకోవాలని సీఎం జగన్ చెప్పారు. లక్షల సంఖ్యలో ఇళ్లు కడుతున్నందున మౌలిక సదుపాయాలు విషయంలో రాజీ పడొద్దన్నారు. అపరిశుభ్రతకు ఈ కాలనీలను నిలయంగా మారకూడదని.. అందుకే కాలనీలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ఈ పనులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. స్వయం ఉపాధి కార్యక్రమాల్లో మహిళలకు చేయూతనిచ్చి నడిపించడం అన్నది చాలా కీలకమని పేర్కొన్నారు. ఆగస్టు 10న మహిళలకు సున్నా వడ్డీ కార్యక్రమం నిర్వహించాలని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa