బద్వేరు నియోజకవర్గంలోని కలసపాడు మండలం మహానంది పల్లి గ్రామంలో శనివారం బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలపై ఆరా తీశారు. ప్రతి ఒక్కరూ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆమె కోరారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa