ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళల బాధ్యత టీడీపీ తీసుకుంటుంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 05, 2023, 03:09 PM

విశాఖపట్నం జిల్లా, తుమ్మపాల పట్టణంలోని వేల్పులవీధి రజకుల కాలనీలో నిర్వహించిన మహాశక్తి కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ... తల్లికి వందనం పథకం ద్వారా ఇంట్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి రూ.15వేలు చొప్పున నగదును అందజేస్తామన్నారు. ఆడబిడ్డ నిధి పథకం ద్వారా 18 ఏళ్లు నిండిన మహిళలందరికీ నెలకు రూ.1500 చొప్పున అందజేస్తామని వివరించారు. చంద్రబాబు మాత్రమే సంపదను సృష్టిస్తారని జగన్మోహన్‌రెడ్డి రాష్ట్ర సంపదను దోచుకుంటున్నారని ఆరోపించారు. మహాశక్తి పధకం ప్రవేశపెట్టి మహిళల జీవితాల్లో వెలుగులు నింపేందుకు టీడీపీ సిద్ధంగా ఉందని తెలిపారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa